కరోనా అలెర్ట్..పెరిగిన కొత్త కేసులు..ఆందోళనలో ప్రజలు

0
41
RT-PCR mandatory

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశంలో 10 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసులు పెరిగాయి. దీనితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,649 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,345,990 కు చేరింది.

ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 96,442 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,677 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 52 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 527452 కి చేరింది.