భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

Corona cases on the rise again in India..what are the deaths?

0
34

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా 8,439 ‬మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనాతో మరో 195 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో మరో 9,525 మంది కోలుకున్నారు.

మొత్తం కేసులు: 34,656,822

మరణాలు: 4,73,952

యాక్టివ్ కేసులు: 93,733

కోలుకున్నవారు: 3,40,89,137

దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మరో 73,62,000 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,29,54,19,975కు చేరినట్లు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 5,98,586 మందికి వైరస్ సోకినట్లు తేలింది.