ఏపీలో కరోనా డేంజర్ బెల్స్..భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..ఆ జిల్లాల్లో అత్యధికం

0
42

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది.  తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,80, 634కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 542కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 83,610 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 3969మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో  3,21,47,031 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా విశాఖ జిల్లాలో ప్రమాదకరంగా 1959 కొత్త కేసులు వెలుగుచూశాయి. చిత్తూరులో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  1534

చిత్తూరు         1198

ఈస్ట్ గోదావరి   1012

గుంటూరు  1458

వైస్సార్ కడప  788

కృష్ణ   304

కర్నూల్  1238

నెల్లూరు   1103

ప్రకాశం    1399

శ్రీకాకుళం 921

విశాఖపట్నం  2258

విజయవాడ   614

వెస్ట్ గోదావరి   613