భారత్ లో కరోనా డేంజర్ బెల్స్..కొత్త కేసులు ఎన్నంటే?

0
37

ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 20557 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,03,889 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,43,091 కు చేరింది.

అలాగే 2603 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,28,388కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16113 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,31, 3623కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 26,04,797 మందికి ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు వేసింది.