ఏపీలో కరోనా కల్లోలం..కొత్తగా 13,618 కేసులు..ఆ జిల్లాల్లో వైరస్ టెర్రర్

0
42

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతోంది.  తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 49,143 సాంపిల్స్ పరీక్షించగా..13,618 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,19,678కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో తొమ్మిది మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,318 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 8,687మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి దాకా 3,22,83,369 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  1650

చిత్తూరు         493

ఈస్ట్ గోదావరి   961

గుంటూరు  1464

వైస్సార్ కడప  907

కృష్ణ   803

కర్నూల్  1409

నెల్లూరు   1007

ప్రకాశం    1295

శ్రీకాకుళం 644

విశాఖపట్నం  1791

విజయనగరం 466

వెస్ట్ గోదావరి   728