రెండు వేల దిగువకు చేరిన కరోనా కొత్త కేసులు..కోలుకున్నవారి శాతం ఎంతంటే?

0
38

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. ప్రస్తుతం కరోనా విజృంభణ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో క్రమక్రమంగా తగ్గుముఖం పడడంతో ప్రజలు కాస్త ఆనందపడే విషయంగానే చెప్పుకోవచ్చు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,675 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 43,109,248గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,832 కు చేరింది. దేశంలో తాజాగా 31 మంది కరోనాతో మరణించడం జరిగింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,92,38,45,615 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 43,109,248

మొత్తం మరణాలు: 5,24,490

యాక్టివ్​ కేసులు: 14,841

కోలుకున్నవారి సంఖ్య:4,26,00,737