దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

0
42

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే మన దేశంలో కూడా కరోనా కొత్త కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8582 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య  4,26,52,743గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 44,513కు చేరింది.ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 195 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 4,26,52,743

మొత్తం మరణాలు: 5,24,761

యాక్టివ్​ కేసులు: 44,513