నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

0
40

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో కూడా నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కొత్త కేసులు నేడు భారీగా పెరిగాయి.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8822  కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య   4,26,67,088గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 53,637కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా195,50,87,271  కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 4,26,67,088

మొత్తం మరణాలు: 5,24,792

యాక్టివ్​ కేసులు: 53,637

 రికవరీ రేటు: 98.66 శాతం