నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

0
33

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే మన దేశంలో కూడా నిన్నటి వరుకు పెరిగిన కరోనా కొత్త కేసులు నేడు కాస్త తగ్గడం ప్రజలు ఆనందపడే విషముగానే చెప్పుకోవచ్చు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3714  కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,31,85,049గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 26,976కు చేరింది. దేశంలో తాజాగా 07 మంది కరోనాతో మరణించడం జరిగింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,94,27,16,543 కోట్ల  మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 4,31,85,049

మొత్తం మరణాలు: 5,24,708

యాక్టివ్​ కేసులు: 26,976

కోలుకున్న వారి సంఖ్య: 4,26,33,365