దేశంలో పెరుగుతున్న కరోనా ఉద్రిక్తి..కొత్త కేసులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

0
39

చైనాలో పురుడు పోసుకున్న ఈ కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాల ప్రజలను అతలాకుతలం చేసింది. కరోనా విజృంభణ తగ్గినట్టే తగ్గి మళ్ళి విరుచుకుపడుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాకుండా ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి.

హర్యానా తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే అందరు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ హెచ్చరిస్తుంది. నేడు కేసులు అధికంగా పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 2,451 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య  14,241 కు చేరింది. దేశంలో తాజాగా 54 మంది కరోనాతో మరణించ గా మృతుల సంఖ్య 5,22,11కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 187,26,26,515 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,25,16,06కు చేరింది.