కరోనా అప్డేట్..భారీ ఊరట..తగ్గిన కొత్త కేసులు

0
44

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో..12,751 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 42 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 3.50 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 16,412 మంది కోలుకున్నారు.

మొత్తం కేసులు: 4,41,74,650

మొత్తం మరణాలు: 5,26,772

యాక్టివ్​ కేసులు: 1,31,807

కోలుకున్నవారి సంఖ్య: 4,35,16,071