కరోనా అప్డేట్..కొత్త కేసులు ఎన్ని నమోదయ్యాయంటే?

0
47

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 12,608 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42, 66980 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,01,343 కు చేరింది.

ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 72 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 527206 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16,251 మంది కరోనా నుంచి కోలు కున్నారు.