కరోనా అప్డేట్..పెరిగిన కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

0
39
RT-PCR mandatory

ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 19,673 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,19,811 కు చేరింది.

ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,43,676 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.5 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 45 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,26, 357 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,955 మంది కరోనా నుంచి కోలు కున్నారు.