కరోనా అప్డేట్: పెరిగిన కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

0
36

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే భయం అందరిలోనూ నెలకొంది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 16,159 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,47,809 కు చేరింది. తాజాగా 28 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,25, 270 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15394 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మొత్తం మరణాలు: 5,25,270

యాక్టివ్​ కేసులు: 1,15,212

కోలుకున్నవారి సంఖ్య: 4,29,07,327