కరోనా అప్డేట్: పెరుగుతున్న కేసులు- హెల్త్‌ బులెటిన్ విడుదల

0
41

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,840 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,04,394 కు చేరింది.

ఇక దేశంలో తాజాగా 43 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,25,386 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16104 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,25,028 కు చేరింది.