భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. మొన్నటి వరకు మూడు లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇవాళ రెండు లక్షల లోపే కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 1,67,059 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,69,499 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 17,43,059 కు చేరింది.
ఇక దేశంలో తాజాగా 1192 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,96,242 కి చేరింది. . 2,54,076 మంది కోలుకున్నారు. దేశంలో రోజు వారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసులు: 4,14,69,499
యాక్టివ్ కేసులు: 17,43,059
మొత్తం మరణాలు: 4,96,242
మొత్తం కోలుకున్నవారు: 3,92,30,198