కరోనా అప్ డేట్- దేశ ప్రజలకు ఊరట

Corona update- solace for the people of the country

0
61

భారత్​లో కరోనా​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న కేసులు పెరగగా తాజాగా కేసుల సంఖ్య 8,318కి చేరింది. వైరస్​​ ధాటికి మరో 465 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 10,967 మందికి పైగా కరోనాను జయించారు. అలాగే దక్షిణాఫ్రికాలో తాజాగా కొవిడ్‌ కొత్త వేరియంట్‌ బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ‘బి.1.1.529’గా గుర్తించిన ఈ రకానికి సంబంధించి ఇంతవరకు 22 కేసులు బయటపడ్డాయి.

మొత్తం కేసులు: 3,45,63,749

మొత్తం మరణాలు: 4,67,933

యాక్టివ్​ కేసులు: 1,07,019

మొత్తం కోలుకున్నవారు: 3,39,88,797

ప్రపంచవ్యాప్తంగా రోజు వారీ కరోనా​ కేసుల్లో పెరుగుదల నమోదైంది. కొత్తగా 569,876 మందికి కొవిడ్​​ పాజిటివ్​గా తేలింది. కరోనా​ ధాటికి 6,337 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 26,08,77,017కు చేరింది. మొత్తం మరణాలు 52,06,265కు పెరిగాయి.