Alert: నేటి నుంచే 12-14 ఏళ్ల చిన్నారుల‌కు క‌రోనా వ్యాక్సినేషన్​

0
41

దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతాకాదు. ఈ రాకాసి మహమ్మారి మూడు వేవ్ లలో ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మహమ్మారి ఆడ్డుకట్టకు ఉన్న అస్త్రాలు మాస్క్ ఒకటి కాగా మరొకటి వ్యాక్సిన్. వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటికే ఫస్ట్, రెండో డోస్ లు దాదాపు పూర్తి కావొచ్చాయి.

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం 2020 జనవరి 16న ప్రారంభం అయింది. జనవరి 16 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. 2020 మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. 2020 ఎప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2020 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా టీకా పంపిణీలో మరో ముందడుగు పడనుంది. దేశ వ్యాప్తంగా నేటి నుంచి 12 నుంచి 14 చిన్నారుల‌కు క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ చేయానుంది. హైద‌రాబాద్ కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ రూపొందించిన కార్బివ్యాక్స్ అనే టీకాతో 12 – 14 ఏళ్ల చిన్నారుల‌కు వ్యాక్సిన్ పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. అందు కోసం కేంద్ర ప్ర‌భుత్వం.. అన్ని రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుదల చేసింది. అలాగే 60 ఏళ్లు పై బ‌డిన వారికి కూడా నేటి నుంచి బూస్ట‌ర్ డోస్ ను సైతం ఇవ్వ‌నున్నారు.

పిల్లలకు కార్బివ్యాక్స్ 0.5 ఎంఎల్​ని ఒక్కో డోస్​గా ఇవ్వనున్నారు. రెండు డోస్​ల మధ్య 28 రోజుల వ్యవధి ఉండాలని అధికారులకు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. టీకా తీసుకున్న తర్వాత దాదాపు గంటసేపు పిల్లలు వ్యాక్సిన్ కేంద్రంలోనే పరిశీలనలో ఉండాల్సి ఉంటుంది. అనంతరం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోతే ఇళ్లకు వెళ్లిపోవచ్చని డీహెచ్ శ్రీనివాస రావు పేర్కొన్నారు.