భారత్ లో తగ్గిన కరోనా ఉద్రిక్తి..తాజా కేసులు ఎన్నంటే?

0
42

కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కానీ ప్రస్తుతం కరోనా విజృంభణ క్రమక్రమంగా తగ్గుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నా… మన దేశంలో మాత్రం రోజురోజుకు కేసులు తగ్గుతున్నాయి. దాంతో నెమ్మదిగా ప్రజలు భయ విముక్తులవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 2,067 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,47,594 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య  12,340 కు చేరింది. దేశంలో తాజాగా 214 మంది కరోనాతో మరణించ గా మృతుల సంఖ్య  5,22,006కి చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా1,86,90,56,607 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో  17,23,733మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.76 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,25,13,248కు చేరింది.