మీకు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? అయితే వీటిని ట్రై చేసి చూడండి..

0
39

మారిన జీవన విధానం అనేక అనారోగ్యాలకు కారణంగా మారుతుంది. సరిగా తినకపోవడం, నిద్ర లేకపోవడం, పోషకాహార లేమి రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. మధుమేహంతో బాధపడేవారు తమను తాము ప్రత్యేకంగా సంరక్షించుకోవాలి. అంతేకాదు శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించగల ఆహారంలో అటువంటి ఆహారాలను చేర్చుకోవడం అవసరం. మరి రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి మీరు ఏ ఆరోగ్యకరమైన డిటాక్స్ పానీయాలను ఆహారంలో చేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

దాల్చిన చెక్క డిటాక్స్ పానీయం మధుమేహంతో బాధపడే వారికి కూడా దాల్చిన చెక్క చాలా మంచిది. దీని కోసం, 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

అల్లం డిటాక్స్ పానీయం అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని తయారు చేయడానికి, ఒక గ్లాసు నీటిలో అల్లం వేయండి. ఆ నీటిని బాగా మరిగించండి. దీని తరువాత ఈ నీటిని ఫిల్టర్ చేసి తాగండి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.

తులసి డిటాక్స్ డ్రింక్ తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంది. అంతేకాదు ఈ డ్రింక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. తులసి డిటాక్స్ డ్రింక్ తయారీకోసం ఒక గ్లాసు నీటిలో 6 నుండి 8 తులసి ఆకులను వేయండి. బాగా వేడి చేయండి. అనంతరం ఆ నీటిని చల్లార్చి తాగండి.

మెంతి డిటాక్స్ డ్రింక్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతులు చాలా మేలు చేస్తాయి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఇప్పుడు వాటిని ఉడకబెట్టండి. అనంతరం ఆ నీటిని ఫిల్టర్ చేసి.. ఆ నీటిని తాగండి.