డాక్టర్ లైట్ వేసి కళ్లను పరీక్షిస్తారు..ఎందుకో తెలుసా?

0
49

మనకు ఏ చిన్న అనారోగ్యం సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ ను కలుస్తాం. వెళ్ళగానే అతను మొదట చేతి దగ్గర నాడి పట్టుకోవడం, కళ్లలో లైట్ వేసి చూసి దానికి గల కారణాలు చెబుతారు. మరి కళ్లలో లైట్ వేసి చూస్తే డాక్టర్లకు ఏ విషయాలు తెలుస్తాయో ఇప్పుడు చూద్దాం..

మ‌నం డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్తే ప‌రీక్ష చేసేట‌ప్పుడు మ‌న క‌ళ్ల‌లో లైట్ వేసి చూస్తారు. దీంతో వారికి ప‌లు విష‌యాలు తెలుస్తాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉంటే క‌ళ్ల లోప‌ల కింది భాగంలో తెల్ల‌గా పాలిపోయిన‌ట్లు ఉంటుంది. ఈ విష‌యాన్ని క‌ళ్ల‌ను ప‌రిశీలించ‌డం ద్వారా తెలుసుకుంటారు. అలాగే క‌ళ్ల‌లో ప‌సుపుద‌నం ఉందో లేదో గ‌మ‌నిస్తారు. ఉంటే జాండిస్ వ‌చ్చింద‌ని చెబుతారు.

ఇక విట‌మిన్ ఎ లోపం ఉంటే క‌ళ్ల‌లో తెల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డుతాయి. ఇవి క‌ళ్ల‌లో తెల్ల‌ని సుద్ద మాదిరిగా ఉంటాయి. ఇవి ఉంటే విట‌మిన్ ఎ లోపం ఉంద‌ని అర్థం. ఇవి కూడా ఉన్నాయో లేవో అని ప‌రిశీలిస్తారు. అలాగే క‌ళ్లలో శుక్లాలు ఏర్ప‌డితే క‌నుగుడ్డు పైభాగంలో తెల్ల‌ని పొర‌లా ఉంటాయి. వీటిని కూడా ప‌రీక్షిస్తారు.

క‌ళ్ల‌లో లైట్ వేయ‌డం వ‌ల్ల క‌నుపాప‌ల సైజ్‌, ఆకారం, రంగు వంటి వాటిల్లో వ‌చ్చే మార్పుల‌ను గ‌మనిస్తారు. అలాగే క‌ళ్ల‌లో కొలెస్ట్రాల్ నిల్వ‌లు ఉన్నా కూడా తెలిసిపోతాయి. అందుక‌నే డాక్ట‌ర్లు మ‌న‌ల్ని ప‌రీక్షించేట‌ప్పుడు లైట్ వేసి క‌ళ్ల‌ను చెక్ చేస్తారు. మ‌న‌కు ఉండే అనారోగ్య స‌మ‌స్య‌లకు చెందిన ల‌క్ష‌ణాలు కొన్నిసార్లు క‌ళ్ల‌లో క‌నిపిస్తాయి. క‌నుక‌నే వారు క‌ళ్ల‌ను ప‌రీక్షించి ఆ ల‌క్ష‌ణాలు ఉన్నాయో లేదో తెలుసుకుంటారు. దీంతో చికిత్స అందించ‌డం సుల‌భ‌త‌రం అవుతుంది. అందుక‌నే వైద్యులు త‌ప్ప‌నిస‌రిగా క‌ళ్ల‌ను లైట్ వేసి మ‌రీ చెక్ చేస్తారు.