ఇలాంటి సమయాలలో అరటిపండు తింటే ప్రాణానికే ప్రమాదమట..!

0
193

అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలుసు. ఆహారం జీర్ణం కావడంలో అరటిపండు ప్రధానపాత్ర  పోషిస్తుంది. కానీ కొన్ని సమయాలలో అరటిపండ్లు తినకపోవడమే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.

అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇది ఇతర పండ్లతో లేదా పాలతో కలిపి తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది. రాత్రి సమయంలో  అరటి పండును తినకపోవడమే మేలు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం తర్వాత కూడా అరటి పండును తినకూడదు. పరగడుపున ఈ పండును తినడం అంతా మంచిది కాదు.