ఒమిక్రాన్‌ భయం..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబానికి కరోనా

Fear of Omicron..Corona to a family from South Africa

0
38

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ కేసులు ఇప్పుడు భారత్​ నుకలవరపెడుతున్నాయి. కర్ణాటక బెంగళూరులో ఇద్దరికి ఈ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. ​ఇప్పుడు రాజస్థాన్​ జైపుర్​లో కూడా ఒమిక్రాన్ వ్యాపించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల జైపుర్​కు వచ్చిన ఓ కుటుంబానికి కరోనా సోకినట్లు నిర్ధరణ కావడమే ఇందుకు కారణం. మరి ఇది ఒమిక్రాన్​ వేరియంటేనా అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది.

నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి ​ అగర్వాల్​. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని తెలిపారు. అయితే, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదని అన్నారు.