గుడ్ న్యూస్..దేశ వ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
38
RT-PCR mandatory

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో..దేశంలో 16,047 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,46,000 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,28,261 కు చేరింది.

ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. తాజాగా 54 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,26, 826కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,539 మంది కరోనా నుంచి కోలు కున్నారు.