Carona update: గుడ్ న్యూస్..భారీగా తగ్గిన కొత్త కేసులు-మరణాలు ఎన్నంటే?

0
49

భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇక కరోనా పీడ విరగడైంది అనుకునే తరుణంలో కొత్త కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోనళకు గురి చేస్తుంది. కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదని, బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవడం సహా ఇతర జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో 5554 కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,44,90,283 కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి మరో 18 మంది మృతి చెందారు.

అలాగే 6322 మంది కరోనాను జయించారు. కాగా పాజిటివిటీ రేటు 96.11గా ఉంది.

మాస్క్ ధరించండి..కరోనాను దరిచేరనీయకండి..