పెరిగిన కరోనా కొత్త కేసులు..నిన్న ఒక్కరోజే ఎన్ని నమోదయ్యాయంటే?

0
38

ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,395 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మృతుల సంఖ్య 33గా నమోదైంది. ఒక్కరోజులో 6,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7కు పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.11 శాతానికి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 4,44,72,241

క్రియాశీల కేసులు: 50,342

మొత్తం మరణాలు: 5,28,090

కోలుకున్నవారు: 4,39,00,204