ఇండియా కరోనా అప్డేట్..బులెటిన్ రిలీజ్..కొత్త కేసులు ఎన్నంటే?

0
34

ఇండియాలో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. దాంతో ప్రజలు నెమ్మదిగా భయ విముక్తులు అవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 1270  కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య4,30,20,723  కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,859కు చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1567మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య  4,24,83,829 కు చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,83,26,35,673మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 4,20,842 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 89.16 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 31 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,21,035 కి చేరింది.

మొత్తం కేసులు:4,30,20,723

మొత్తం మరణాలు:5,21,035

యాక్టివ్​ కేసులు: 15,859

కోలుకున్నవారు:4,24,83,829