ఇండియా కరోనా అప్డేట్..హెల్త్ బులిటెన్‌ రిలీజ్..కొత్త కేసులు ఎన్నంటే?

0
36

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. ప్రస్తుతం కరోనా విజృంభణ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో క్రమక్రమంగా తగ్గుముఖం పడడంతో ప్రజలు కాస్త ఆనందపడే విషయంగానే చెప్పుకోవచ్చు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,226 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య  43,105,551 గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,955 కు చేరింది. దేశంలో తాజాగా 65 మంది కరోనాతో మరణించడం జరిగింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,92,28,66,524 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 43,105,551

మొత్తం మరణాలు: 5,24,413

యాక్టివ్​ కేసులు: 14,955

కోలుకున్నవారి సంఖ్య: 4,25,97,003