భారత్ కరోనా అప్డేట్…కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

0
45
RT-PCR mandatory

ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రోజుకు దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.

ప్రజలంతా తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 5,439 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక గడిచిన 32 గంటల్లో 24 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 4,44,08,132

క్రియాశీల కేసులు: 65,732

కోలుకున్నవారు: 4,38,25,024