ఇండియా కరోనా అప్డేట్.. నేడు మూడువేలు దాటినా కొత్త కేసులు

0
42

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో నిన్నటి వరకు భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు నేడు ఒక్కసారిగా  పెరగడం ఆందోళన పడే విషయంగానే చెప్పుకోవచ్చు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3712 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,31,64,544గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 19,509 చేరింది. దేశంలో తాజాగా 05 మంది కరోనాతో మరణించడం జరిగింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,70,51,104 కోట్ల  మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 4,31,64,544

మొత్తం మరణాలు: 5,24,641

యాక్టివ్​ కేసులు: 19,509

కోలుకున్నవారి సంఖ్య: 4,26,20,394