ఇండియా కరోనా అప్డేట్..కొత్తగా 1259 కేసులు..మరణాలు ఎన్నంటే?

0
34

ఇండియాలో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. దాంతో ప్రజలు నెమ్మదిగా భయ విముక్తులు అవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో1705 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య4,24,85,534 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,378కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1705 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా రికవరీల సంఖ్య  4,24,85,534 కు చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,83,53,90,499 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసిన్నట్టు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 25,92,407 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 89.16 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 35మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,21,070 కి చేరింది.