ఇండియా కరోనా అప్డేట్..మూడు వేలు దాటినా కొత్త కేసులు

0
48

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. కరోనా విజృంభణ తగ్గినట్టే తగ్గి మళ్ళి జనాలపై విరుచుకుపడుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే అందరు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ హెచ్చరిస్తుంది.

నేడు కేసులు అధికంగా పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో  3303 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,68,799 చేరి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 16,980 కు చేరింది. దేశంలో తాజాగా 39 మంది కరోనాతో మరణించ గా మృతుల సంఖ్య 5,23,693కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా1,88,40,75,453  మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. దీంతో రికవరీ ల సంఖ్య 4,25,28,126 కు చేరింది