ఇండియా కరోనా అప్డేట్..తగ్గిన కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

0
37

కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కానీ ప్రస్తుతం కరోనా విజృంభణ క్రమక్రమంగా తగ్గుతుంది. దాంతో నెమ్మదిగా ప్రజలు భయ విముక్తులవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో దేశంలో 1,033 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,31,958  కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 11,639 కు చేరింది. దేశంలో తాజాగా 43  మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,21,530 కి చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98 శాతంగా ఉంది.  ఇక దేశ వ్యాప్తంగా రికవరీ ల సంఖ్య  4,24,87,89  కు చేరింది.