పిల్లలు అప్పుడే వద్దు అని పిల్స్ వాడుతున్నారా చాలా డేంజర్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయంటే

పిల్లలు అప్పుడే వద్దు అని పిల్స్ వాడుతున్నారా చాలా డేంజర్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయంటే

0
38

వివాహం అయిన తర్వాత చాలా మంది వెంటనే పిల్లలు వద్దు అనుకుంటారు, దీని కోసం కొందరు గర్భనిరోధక సాధనాలు వాడుతూ ఉంటారు, ముఖ్యంగా అందులో బర్త్ కంట్రోల్ పిల్స్ , వీటి వాడకం ఈ మధ్య బాగా పెరిగిపోయింది, నెలకి లక్షల మందులు అమ్ముడు అవుతున్నాయి, అయితే ఇవి చాలా మంది, డాక్టర్ ని కన్సెల్ట్ అవ్వకుండా మెడికల్ షాపుల్లో నేరుగా తీసుకుంటున్నారు.

ఇవి వాడితే చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు, అంతేకాదు పిల్లలు కావాలి అని అనుకున్న సమయంలో మీకు వీటి వల్ల పిల్లలు పుట్టడానికి ఇంకా లేట్ అవుతుంది అంటున్నారు..ఈ పిల్స్ వాడితే మహిళల శరీరంలో విటమిన్–బి, సి, ఈ, జింక్, సెలీనియం, మెగ్నీషియం తగ్గుతుంది, ఈ మందులు వాడేవారిలో ఎమోషన్స్ పెరిగిపోతాయి, చాలా మందికి చిన్న విషయానికి కోపం వస్తుంది మీరు గమనించవచ్చు.

వీటిని వాడటం వల్ల అమ్మాయిలు అనూహ్యంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓవర్ డోస్ అవడం వల్ల వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇలాంటి మందులు వాడితే ఇవి అమ్మయిలకి కాలేయం పై ఎఫెక్ట్ చూపిస్తాయి, ఏకంగా కొందరు వారానికి 10 కూడా వాడతారు.. దీని వల్ల వచ్చే రోజుల్లో వారికి పిల్లలు పుట్టే సమయంలో అడ్డంకి ఏర్పడే ప్రమాదం ఉంది.