షుగర్ తో బాధపడుతున్నారా ఈ ఫుడ్ తినండి మీకు ఏ సమస్య రాదు

షుగర్ తో బాధపడుతున్నారా ఈ ఫుడ్ తినండి మీకు ఏ సమస్య రాదు

0
34

ఈరోజుల్లో ప్రపంచంలో 25 శాతం కుటుంబాలు ఇంటిలో ఎవరో ఒకరికి షుగర్ వల్ల ఆయా కుటుంబాలు బాధ పడుతున్నాయి.. ఇది ఒకసారి వచ్చింది అంటే చచ్చే వరకూ మనల్ని వదిలి పెట్టదు.. అయితే వారసత్వంగా కూడా ఇది వస్తుంది, అయితే షుగర్ రాకుండా చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల వారికి మంచిదే ..అయితే సరైన వ్యాయామాలు సరైన పని చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.

ముఖ్యంగా షుగర్ సమస్య ఉన్న వారు గ్లూకోజ్ ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకోరు.. షుగర్ పెరుగుతుంది అని ..అయితే ఎలాంటి ఆహరం తీంటే మంచిది వీరికి ఎది బెటర్ అనేది డాక్టర్లు చెబుతున్నారు మరి ఆ ఫుడ్ ఏమిటో చూద్దామా.

మధుమేహం ఉన్నవారు అన్ని రకాల ధాన్యాలు ఆహారంగా తీసుకోవచ్చు. అయితే, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది, ఇక వీరు వారానికి మూడు రోజులు ఆకుకూరలు తింటే మంచిది, ఇక వీరికి పాలకూర చాలా ఆరోగ్యకరం , వీరు చికెన్ మటన్ ఇలాంటి ఫుడ్ కాకుండా ఎక్కువ ఆకుపచ్చని కాయగూరలు తింటే మంచిది.

టమాట, వంకాయ, బీరకాయ, గోకరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రకోలి, దోసకాయ, మునగకాయ, ఆనక్కాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక షుగర్ ఉన్న వారు బ్రకోలి తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది …ఇక చేపలు కూడా షుగర్ ఉన్న వారు తింటే ఆరోగ్యానికి మంచిది.