తెలంగాణలో నేడు తగ్గిన కరోనా : ఆ 11 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు

Telangana Corona Cases Bulletin Released

0
39

తెలంగాణలో మంగలవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేటి బులిటెన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 987 నమోదు కావడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇవాళ త్రిబుల్ డిజిట్ కేసులు జిహెచ్ఎంసి, ఖమ్మం జిల్లాల్లో నమోదు కాగా 11 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు వచ్చాయి. మరణాల సంఖ్య 7 మాత్రమే. ఇవాళ చేసిన పరీక్షల సంఖ్య 121236. నేడు రికవరీ అయిన వారి సంఖ్య 1317. పెండింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 1327.

నేడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 1
కొత్తగూడెం 60
జిహెచ్ఎంసి 130
జగిత్యాల 25
జనగామ 7
జయశంకర్ భూపాలపల్లి 18
జోగులాంబ గద్వాల 2
కామారెడ్డి 4
కరీంనగర్ 52
ఖమ్మం 102
కొమరం భీం ఆసిఫాబాద్ 4
మహబూబ్ నగర్ 11
మహబూబాబాద్ 40
మంచిర్యాల 52
మెదక్ 5
మేడ్చల్ మల్కాజ్ గిరి 46
ములుగు 19
నాగర్ కర్నూల్ 9
నల్లగొండ 69
నారాయణపేట 2
నిర్మల్ 3
నిజామాబాద్ 10
పెద్లపల్లి 51
రాజన్న సిరిసిల్ల 27
రంగారెడ్డి 42
సంగారెడ్డి 18
సిద్దిపేట 24
సూర్యాపేట 64
వికారాబాద్ 6
వనపర్తి 7
వరంగల్ రూరల్ 23
వరంగల్ అర్బన్ 38
యాదాద్రి భువనగిరి 16

మంగళవారం విడుదలైన తెలంగాణ కరోనా బులిటెన్ లో కొత్త కొత్త విషయాలు వెలుగు చూశాయి. నిన్నమొన్నటి వరకు ఖమ్మం జిల్లాలో డుబుల్ డిజిట్ కేసులు నమోదు కాగా ఇవాళ రెట్టింపు స్థాయిలో కేసుల సంఖ్య నమోదైంది. త్రిబుల్ డిజిట్ కు చేరుకున్నాయి.
ఇక 11 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదు కావడం తెలంగాణ ప్రజానీకానికి ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. అందులో ఇక నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, పెద్దపల్లి, మల్కాజ్ గిరి, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో మాత్రం ఎక్కువ సంఖ్యలో కేసులు వస్తున్నాయి.

  ఈ వార్త కూడా చదవండి……

ఏపిలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు – బులిటెన్ రిలీజ్