తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..జనవరి 20 వరకు అవన్నీ బంద్!

Telangana government's key decision..everything will be closed till January 20!

0
74

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ మొదలైందనే భయం కలుగుతుంది.

ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జీవో నెం 6 తీసుకువచ్చింది. దీనితో రాష్ట్రంలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్‌ నిర్వహించకూడదు. అలాగే ప్రజలు గుంపులుగా చేరకూడదు. బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా , వ్యాపార సంస్థల్లో ప్రతి ఒక్కరు తప్పని సరి మాస్కు ధరించాలి. ఈమేరకు ఆదివారం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కు ధరించకుంటే రూ.1000 జరిమానా విధిస్తారు. అలాగే మతపర, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై సర్కార్ నిషేధం విధించింది.

అదేవిధంగా  ప్రత్యక్ష తరగతుల చదువులు సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చిందంటూ వైద్య శాఖ చెబుతుండటంతో ముందుగానే విద్యాలయాలకు సంక్రాంతి సెలవులతో సర్దేసింది సర్కారు. ఇంతవరకు బానే ఉన్నా ఈ నెల 16తో సంక్రాంతి హాలీడేస్ ముగుస్తాయి. ఆ తర్వాత పరిస్థితే గందరగోళంగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా మళ్లీ బడులు తెరుచుకునే పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఈ నెలాఖరులో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని హెల్త్ డిపార్ట్ మెంట్ చెబుతుంటే..స్కూళ్లు ఓపెన్ చేసే పరిస్థితే ఉండదని నిపుణులు చెబుతున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల11 నుంచి బడులకు, 13 నుంచి కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా… 8 నుంచే విద్యాసంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.సెలవుల తర్వాత ఫిజికల్ క్లాసులకు సర్కార్ అనుమతిచ్చేది డౌటేనని ఆఫీసర్లే చెబుతున్నారు. దీంతో విద్యాసంవత్సరం వేస్ట్ కాకుండా స్టూడెంట్లకు పాఠాలు చెప్పేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ ఆన్​లైన్, టీవీ పాఠాలను స్టూడెంట్లకు అందించేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.