తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు : బులిటెన్ రిలీజ్

Today Telangana Corona Cases Bulletin Released

0
39

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది.  సోమవారం వెల్లడైన కరోనా బులిటెన్ లో  ఒక జిల్లాలో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక సింగిల్ డిజిట్ కేసులు నమోదైన జిల్లాలు ఆరు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు వచ్చాయి.
సోమవారం నమోదైన కేసులు 1197 మాత్రమే. ఆదివారం నమోదైన 1006 కేసులతో పోలిస్తే వంద పైగా పెరిగాయని చెప్పవచ్చు. సోమవారం మరణాల సంఖ్య 9 నమోదైంది. ఆదివారం 11 మరణాలతో పోలిస్తే సంఖ్య రెండు తగ్గింది. జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసిలో మాత్రమే 137 కేసులతో త్రిబుల్ డిజిట్ నమోదైంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సైతం పరిస్థితి ఆశాజనకంగా మారి డబుల్ డిజిట్ కు కేసులు చేరుకున్నాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు 119537 జరిపారు. కోవిడ్ సోకి ఇవాళ కోలుకున్న వారి సంఖ్య 1707గా ఉంది. రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 17246 మాత్రమే ఉన్నాయి. వెయిటింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 965.
సోమవారం నాడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 4 కేసులు
కొత్తగూడెం 71
జిహెచ్ఎంసి 137
జగిత్యాల 19
జనగామ 14
జయశంకర్ భూపాలపల్లి 26
జోగులాంబ గద్వాల 8
కామారెడ్డి 2
కరీంనగర్ 64
ఖమ్మం 67
కొమరం భీం ఆసిఫాబాద్ 9
మహబూబ్ నగర్ 21
మహబూబాబాద్ 56
మంచిర్యాల 46
మెదక్ 10
మేడ్చల్ మల్కాజ్ గిరి 71
ములుగు 27
నాగర్ కర్నూల్ 17
నల్లగొండ 84
నారాయణపేట 8
నిర్మల్ 1
నిజామాబాద్ 12
పెద్లపల్లి 58
రాజన్న సిరిసిల్ల 23
రంగారెడ్డి 65
సంగారెడ్డి 14
సిద్దిపేట 39
సూర్యాపేట 72
వికారాబాద్ 19
వనపర్తి 26
వరంగల్ రూరల్ 11
వరంగల్ అర్బన్ 43
యాదాద్రి భువనగిరి 53