Manoj Bharathiraja | ప్రముఖ నటుడు, భారతీ రాజా కుమారుడు కన్నుమూత

-

ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా కుమారుడు.. తమిళ నటుడు, చిత్రనిర్మాత మనోజ్ భారతీరాజా(Manoj Bharathiraja) మంగళవారం కన్నుమూశారు. ఇటీవల ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకుంటున్న సమయంలోనే చెన్నైలోని చెట్‌ పేట్‌ లోని తన ఇంట్లో ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారు. 48 ఏళ్ల మనోజ్ ఆకస్మిక మరణం సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు నటులు, రాజకీయ నాయకులు, సాంకేతిక నిపుణులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

- Advertisement -

మనోజ్ కు భార్య నందన, ఇద్దరు కుమార్తెలు అర్షిత, మతివధాని ఉన్నారు. ఆయన భార్య కూడా తమిళంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. వీరిద్దరూ నవంబర్ 19, 2006న వివాహం చేసుకున్నారు. అంతకంటే ముందు సాధురియన్ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు.

సీఎం, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి

మనోజ్ అకాల మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ తన ఆవేదనను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. “ఇంత చిన్న వయసులోనే ఆయన మరణ వార్త విని నేను షాక్ అయ్యాను. తన తండ్రి సినిమా తాజ్ మహల్ తో కెరీర్ ప్రారంభించిన ఆయన సముద్రామ్, వరుషమేల్లం వసంతం వంటి సినిమాల ద్వారా తనకంటూ ఒక పేరును సృష్టించుకున్నారు. భారతీరాజా, ఆయన కుటుంబానికి నా సంతాపం.” అని స్టాలిన్ ట్వీట్ చేశారు. తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జి కె వాసన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సంతాపం వ్యక్తం చేసిన చిత్ర పరిశ్రమ

నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా తన బాధను పంచుకున్నారు. “మనోజ్ ఆకస్మిక మరణ వార్త విని నేను షాక్ అయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. భారతీరాజా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.” అని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.

నటి ఖుష్బు సుందర్ ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. “మనోజ్ ఇక లేరని విని చాలా షాక్ అయ్యాను. ఆయన అకాల మరణం బాధాకరం. భారతీరాజా సర్, ఆయన కుటుంబానికి ఈ భరించలేని నష్టాన్ని భరించే శక్తిని దేవుడు ప్రసాదించుగాక. మనోజ్, మిమ్మల్ని చాలా మిస్ అవుతాము. రెస్ట్ ఇన్ పీస్.” అని ఖుష్బు ట్వీట్ చేశారు.

సినీ ఇండస్ట్రీలో మనోజ్ భారతీ రాజా(Manoj Bharathiraja) ప్రయాణం

1976లో భారతీరాజా, చంద్రలీల దంపతులకు జన్మించిన మనోజ్ 1999లో తాజ్ మహల్ సినిమాతో తొలిసారిగా నటించారు. కాదల్ పుక్కల్, ఈర నీలం, వాయిమై వంటి చిత్రాలలో నటించారు. ఆ తర్వాత ఈశ్వరన్, మానాడు, విరుమాన్ వంటి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు. 2023లో ఆయన తన తండ్రి, కొత్త నటులు శ్యామ్ సెల్వన్, రక్షణ నటించిన మార్గళి తింగళ్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆయన చివరిగా ప్రైమ్ వీడియో సిరీస్ స్నేక్స్ అండ్ లాడర్స్‌ లో కనిపించారు.

Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. ఆ శాఖను వదులుకోనున్న రేవంత్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chhattisgarh | భద్రతా దళాల ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు హతం

భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు...

Myanmar | మయన్మార్ భూకంపం: వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన...