Nagarjuna | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని హీరో నాగార్జున(Akkineni Nagarjuna) మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌‌లోని ఆయన నివాసంలో భార్య అమల(Amala)తో కలిసిన నాగార్జున.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. త్వరలోనే పలువురు సినీ పెద్దలు సీఎంను కలిసి సినీ పరిశ్రమ గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

మరోవైపు నంది అవార్డులపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. వచ్చే ఉగాది నాటికి నంది అవార్డులను ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఈ అవార్డులను ఇస్తామని వ్యాఖ్యానించారు. త్వరలోనే అవార్డుల అంశంంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Read Also: సీఎం జగన్‌పై నిర్మాత నట్టికుమార్ తీవ్ర విమర్శలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...