Ram Charan | అయోధ్య నుంచి రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం

-

Ayodhya-Ram Charan | యావత్ భారతదేశం వందల సంవత్సరాలుగా వేచి చూస్తున్న అద్భుత క్షణానికి ఇంకో తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నాయి. శతాబ్దాలుగా రామమందిర నిర్మాణం.. అందులో రాములోరి విగ్రహం ప్రాణపతిష్ట గురించి వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. మొత్తానికి ఆ కల జనవరి 22న నెరవేరబోతుంది. ఆ రోజు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంతో పాటు “రామ్‌ లల్లా” విగ్రహం ప్రతిష్టం నభూతో నభవిష్యతీగా జరగనుంది. ఈ చారిత్రాత్మక వేడుకకు దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు విచ్చేయనున్నారు.

- Advertisement -

అలాగే ఈ బృహత్తర కార్యక్రమానికి దేశంలోని అన్ని ప్రముఖ పార్టీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానపత్రికలు పంపింది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతుకు ఆహ్వానం అందించింది. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సునీల్ అంబేకర్.. చరణ్(Ram Charan) ఇంటికి వెళ్లి మరీ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ ఆహ్వానం పట్ల చెర్రీ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ పూర్వజన్మ సుకృతమని తెలిపారు. సౌత్ ఇండస్ట్రీ నుంచి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Pawan Kalyan), ధనుష్‌లకు మాత్రమే ఆహ్వానం అందింది.

Read Also: ఈ ఫుడ్స్ ఏ టైమ్ లో తీసుకుంటే ఆరోగ్యమో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...