బిగ్ బాస్ హౌస్ లో మసాలా తగ్గనుందా… వారు చివరి నిమిషంలో షో ఎంట్రీకి నో చెప్పారట

బిగ్ బాస్ హౌస్ లో మసాలా తగ్గనుందా... వారు చివరి నిమిషంలో షో ఎంట్రీకి నో చెప్పారట

0
29

బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాగ్… ఈ షోకు సంబంధించి కొద్దికాలంగా అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… కరోనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటిస్తూ కంటెస్టెంట్స్ ఐసోలేషన్ కు వెళ్లిపోయారు… ముఖ్యంగా సీజన్ 4 కు సంబంధించి రఘు మాస్టర్ దంపతుల గురించి అనేక వార్తలు వచ్చాయి…

సీజన్ 3 లో వరుణ్ వితికలు సందడి చేసిన సంగతి తెలిసిందే… ఇప్పుడు రఘు మాస్టర్ ఆయన భార్య సింగర్ ప్రణవి సందడి చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే… ఈ వార్తలపై వారు ఇంతవరకు స్పందించకపోవడంతో షోకు వెళ్లబోతున్నారనే వార్తలు వచ్చాయి.. అయితే చివరి నిమిషంలో వీరు షోకు నో చెప్పారని టాక్ వినిపిస్తోంది…

బిగ్ బాస్ వెల్లడమంటే చాలా రిస్క్ అని ఓర్పు ఉండాలిని ఇప్పటివరకు కెరియర్ పరంగా లాభం పొందినది ఏమీ లేదని చెప్పారట ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు దీంతో రఘుమాస్టర్ పునరాలోచన చేసుకున్నారట… ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజం అయితే ఈ సారి హౌస్ లో కపుల్ లేనట్లే అని అంటున్నారు… ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే…