లాయర్ సాబ్ లో ప్రముఖ నిర్మాత కూతురు

లాయర్ సాబ్ లో ప్రముఖ నిర్మాత కూతురు

0
38

పవర్స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు. అజ్ఞాతవాసి తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సినిమాల్లో నటిస్తారా? లేదా? అనే సందేహంలో చాలా ఏళ్లుగా ఫ్యాన్స్ ఉన్నారు, కాని ఎట్టకేలకు ఆయన కొత్త సినిమా ఖరారైంది. హిందీ హిట్ పింక్ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు…గత వారం ఆయన సినిమా స్టార్ట్ చేశారు.

టాలీవుడ్ నిర్మాత దిల్రాజుతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు …పింక్ లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. 2016 సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయం సాధించింది. ఇదే సినిమాను తమిళంలో అజిత్తో బోనీ నిర్మించారు. అక్కడ కూడా హిట్ అయింది.

అయితే 2018లో అజ్ఞాతవాసిలో చివరిసారి వెండితెరపై కనిపించారు పవన్ కల్యాణ్ . ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నికల ప్రచారం, రాజకీయాలతో బిజీ అయ్యారు. తాజాగా ఆయన ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమాపై వార్త వినిపిస్తోంది, . పూజా హెగ్దే ని ఓ నటిగా తీసుకున్నారు.. ఇక మరో పాత్ర కోసం జాన్వీ కపూర్ ని తీసుకుంటున్నారు అని తెలుస్తోంది, పవన్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తోందట జాన్వీ కపూర్, ఇప్పటికే బోనీ కూడా ఈ విషయం ఆలోచించి డెసిషన్ తీసుకున్నారట, ఇది కన్ఫామ్ అవునా కాదా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.