Flash: “అంటే సుందరానికి” మూవీ నిర్మాణ బృందంపై కేసు నమోదు..

0
39

వేక్ ఆత్రేయా ద‌ర్శ‌క‌త్వంలో నానికి జోడీగా న‌జ్రియా హీరోయిన్‌గా నటించిన సినిమా “అంటే సుందరానికి” మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నిర్మాణ బృందంపై 188 సెక్షన్  పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం తెలుస్తుంది.

మైత్రీ మూవీస్ , శ్రేయాస్ మీడియా ఫై మాదాపూర్ పీఎస్ లో కేసు పోలీసులు కేసు నమోదు చేసారు. కారణం ఏంటంటే..మాదాపూర్ శిల్పకళా వేదికలో అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా..ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ లాంటి వీఐపీ వచ్చిన  సమాచారం తెలియకుండా శ్రేయాస్ మీడియా సురేష్ నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.