కరోనా టైమ్ లో రేటు పెంచేసిన తమన్నా….

కరోనా టైమ్ లో రేటు పెంచేసిన తమన్నా....

0
31

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో నితిన్ భీష్మ తో మంచి విజయం అందుకున్నాడు… ఇప్పుడు మరో సినిమాకు రెడీ అయిపోయాడు… బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు…

ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ పై సుధాకర్ రెడ్డి నికితరెడ్డి లతో పాటు ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు… మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసనగా తమన్నా నభా నటేశ్ లను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి…

అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… తమన్నా ఈ చిత్రంకోసం 1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి… తమన్నా కెరియర్ లో ఇప్పుడున్న పరిస్థితిలో ఇది ఎక్కువే అంటున్నారు కొందరు కాగా హిందీ లో టబు రాధిక అప్టేలు నటించారు…