టాలీవుడ్ లో తీవ్ర విషాదం..ప్రముఖ ఎడిటర్ కన్నుమూత

0
30

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్యంతో కన్నుమూశారు. అతని మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన ఖైదీ నెం. 150, గోపాల గోపాల, బలుపు, రేసుగుర్రం, గబ్బర్ సింగ్ వంటి టాప్ సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు. ఇప్పటివరకు సుమారు 800 సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా పని చేశారు.