ఆ డైరెక్టర్ కథ మార్చడంతో సినిమా ప్లాఫ్ అయింది. విష్ణు

ఆ డైరెక్టర్ కథ మార్చడంతో సినిమా ప్లాఫ్ అయింది. విష్ణు

0
33

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ప్లాఫ్ మూవీ ఆచార్య అమెరికా యాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు… ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు…. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

ఆచార్య అమెరికా యాత్ర సినిమాకు ముందు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి చెప్పిన కథ వేరని షూటింగ్ చేసేటప్పుడు కథను మార్చేశారని చెప్పారు… కథ విషయంలో తాను నిలదీశానని తెలిపాడు…

అంతేకాదు మరోక సినిమా ప్లాప్ అవుతుందని రషెస్ చూసినప్పుడే తెలిసినట్లు పేర్కొన్నాడు విష్ణు… అది ఏ సినిమా అనేది తెలియాల్సి ఉంది… ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని వివాదాలకు దారి తీస్తుందోనని అందరు చర్చించుకుంటున్నారు…