Director Yashasvi | చెన్నైలో ఉండి బతికిపోయాడు.. సంగీత దర్శకుడిపై డైరెక్టర్ ఫైర్..

-

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ రథన్ మీద తెలుగు దర్శకుడు యశస్వి(Director Yashasvi) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘సిద్ధార్థ్ రాయ్’ అనే మూవీకి యశస్వి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి రథన్(Radhan) మ్యూజిక్ అందించారు. తాజాగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ ఓ సినిమాను చంపేస్తున్నాడంటూ రథన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

“ఈ విషయం అందరికీ తెలియాలి.. ఇంకెవ్వరూ తనలా మోసం పోవద్దు.. సినిమాను చంపేయాలని చూస్తుంటాడు.. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది.. రధన్ వల్లే ఈ సినిమా ఇంత ఆలస్యం అయింది.. ఎప్పుడు అడిగినా అపాయింట్‌మెంట్ ఇచ్చేవాడు కాదు.. అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతోంది. అతను గొడవ పడటానికే మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. మ్యూజిక్ సిట్టింగ్‌ల సందర్భంగా ఓరోజు రాజమండ్రిలో ఉండగా అతను ఫోన్ చేశాడు.. వైజాగ్ వచ్చే వరకు ఆ ఫోన్ కాల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఎంతలా ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటుందో అర్థం చేసుకోండి. సినిమాను ఓ మూలకు తీసుకెళ్లి పడేస్తాడు.. రథన్ చెన్నైలో ఉండి బతికిపోయాడు.. ఇక్కడే ఉంటే చాలా గొడవలు అయ్యేవి” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

అంతేకాకుండా గతంలో అర్జున్ రెడ్ది సమయంలో ఆ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి.. రథన్ గురించి మాట్లాడిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.”అర్జున్ రెడ్డి మూవీ సమయంలో ఇప్పటికప్పుడు సినిమాను వదిలేస్తే ఏం చేస్తావ్ అని చాలా రూడ్‌గా అన్నాడు” అంటూ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెబుతాడు. దీంతో ఇప్పుడు యశస్వి(Director Yashasvi), సందీప్ మాట్లాడిన మాటలు మళ్లీ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Read Also: ఈ చిన్నచిన్న ఆహారపు అలవాట్లతో గుండె ఆరోగ్యం పదిలం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...