Lasya Nanditha | లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు

-

రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఆమె మృతి పట్ల హరీష్ రావు(Harish Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పటాన్ చెరులో ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడి మనోధైర్యం చెప్పారు. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటువంటి విషాద సమయంలో ధైర్యం కొల్పోవద్దని సూచించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాస్య మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఇంటికి తరలించే వరకు హరీష్ రావు ఉన్నారు.

- Advertisement -

అలాగే, హరీష్ రావు లాస్య(Lasya Nanditha) మృతిపై స్పందిస్తూ.. ఎంతో భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు పటాన్ చెరు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కంటోన్మెంట్ నుండి ఓ ఫంక్షన్ కి హాజరయ్యేందుకు సదాశివపేట వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ యాక్సిడెంట్ అయింది.

Read Also: ఎమ్మెల్యే లాస్య మృతిపై KCR, KTR తీవ్ర దిగ్భ్రాంతి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...