గుడ్ న్యూస్..ఈ నెలలో ఆ తేదీ నుండి ‘సర్కారు వారి పాట’ ఫ్రీగా చేసేయండి

0
41

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమాలో మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనపడి అభిమానులను ఖుషి చేసాడు.

ఈ సినిమా చూడాలంటే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్స్ లో పే పర్ వ్యూ మోడల్ లో డబ్బులు చెల్లించి సినిమా చూడాల్సి ఉంటుందని మేకర్స్ ఇటీవలే తెలుపగా..దీనికి సంబంధించి అదిరిపోయే శుభవార్త చెప్పింది చిత్రబృందం. ఈనెల 23 నుంచి ప్రైమ్ లో సబ్ స్క్రైబర్లందరూ ఉచితంగా చూడొచ్చని అమెజాన్ ప్రకటించింది.